Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ మనవరాలికి ఇష్టం లేని పెళ్లి.. ఆపిన తాతయ్య.. రాయిని తలపై మోది..?

మైనర్ మనవరాలికి ఇష్టం లేని పెళ్లి.. ఆపిన తాతయ్య.. రాయిని తలపై మోది..?
, మంగళవారం, 20 నవంబరు 2018 (15:53 IST)
మనవరాలికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న తాత ఆ పెళ్లిని ఆపేశాడు. మైనర్ మనువరాలికి ఇష్టం లేని పెళ్లి ఎందుకు అంటూ ప్రశ్నించాడు. అంతే కోపంతో ఊగిపోయిన కొడుకు.. తండ్రినే హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం సమీపంలోని కరేనిహళ్లికి చెందిన నివాసి కుమార్ తన 15ఏళ్ల కుమార్తె పుష్పకు స్థానిక సుబ్రహ్మణ్య కుమారుడు బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. కానీ ఆ వివాహం పుష్పకు ఇష్టం లేదు. పై చదువులు చదువుకోవాలని ఆశపడింది. కుటుంబసభ్యులకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. తాతయ్య (ఈశ్వరప్ప)తో ఈ వివరాలన్నీ చెప్పింది. 
 
ఇక మనవరాలి సంతోషమే ముఖ్యంగా భావించిన తాతయ్య పెళ్లి రోజు మహిళా-శిశు అభివృద్ధి శాఖ అధికారులకు ఫోన్ చేసి మైనర్ బాలికకు వివాహం జరుగుతుందని వచ్చి.. ఆమెను రక్షించాలని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వివాహ వేదిక వద్దకు చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. కానీ ఈ పెళ్లి ఆగిపోయిన కోపంతో.. బాలిక తండ్రి, వరుడి తండ్రి... ఈశ్వరప్పతో గొడవకు దిగారు.
 
ఈ గొడవ పెద్ద వాగ్వివాదానికి కారణమైంది. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన వారిద్దరూ బండరాయితో తలపై మోది పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరప్పను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈశ్వరప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థిని బెత్తంతో దంచిపారేసిన టీచర్.. డబ్బులిచ్చి చదువు చెప్పమంటే..?