Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం భార్యను గదిలో బంధించి.. మ...న్ని కోసి చిత్ర హింసలకు..?

Advertiesment
ఆస్తి కోసం భార్యను గదిలో బంధించి.. మ...న్ని కోసి చిత్ర హింసలకు..?
, మంగళవారం, 20 నవంబరు 2018 (11:45 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆస్తి, అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. 
 
అయితే వివాహం జరిగినప్పటి నుంచి బాధితురాలిపై కన్నేశాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన ఆమె మేనత్త వద్ద వుంటోంది. ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడంతో.. ఆమె ఆస్తి కోసం బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. 
 
పెళ్లయ్యాక మేనత్త ఆస్తిని రాయించుకోవాలని వేధించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తన మాట వినటం లేదనే కోపంతో ఆమెను గదిలో బంధించి మర్మావయాన్ని కోసి చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
కన్నబిడ్డను కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గృహహింస చట్టం కింద రమణకుమార్‌ను అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పోల్స్ : కూటమిలోనే కుమ్ములాట.. 11 స్థానాల్లో నువ్వానేనా