Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళికి బంగారం పెట్టలేదు.. పెళ్లైన మూడు నెలలకే..?

Advertiesment
Tamilnadu
, సోమవారం, 19 నవంబరు 2018 (11:12 IST)
పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. దీపావళి పండుగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి (29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన కృష్ణస్వామి కుమారుడు యువరాజ్‌తో సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీపావళికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. 
 
పెళ్లై తొలి దీపావళి కావడంతో పెళ్ళికొడుకు బంగారు నగలు ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఇటీవల వివాహం చేసి వుండటం డబ్బు చేతిలో సరిపడా లేక పోవడంతో.. కొత్త అల్లుడికి బంగారం పెట్టలేకపోయారు. ఇదే సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక.. రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. 
 
ఇంతలోపే.. ఆమె మరణించినట్లు సమాచారం అందడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. కానీ యువరాజ్ మాత్రం కడుపులో నొప్పిగా వుందని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ పార్టనర్ చంద్రబాబు రాజకీయ వ్యభిచారి.. సుధాకర్ బాబు