Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూకాశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం - 6 రౌండ్ల కాల్పులు

జమ్మూకాశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం - 6 రౌండ్ల కాల్పులు
, శుక్రవారం, 2 జులై 2021 (12:31 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ల సంచారం కనిపించింది. ఇది కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. దీన్ని పసిగట్టిన భారత సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
 
శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్మూ శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్‌ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఆరుసార్లు కాల్పులు జరిపారు. 
 
దీంతో ఆ డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్‌ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్ములో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
 
కాగా, గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడిని సైన్యం భగ్నం చేసింది. 
 
కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రమాకలే ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు కేంద్రం చేపట్టిన చర్యలను భగ్నం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలకు ఉగ్రమూకలు పూనుకుంటున్నట్టు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతరిక్షంలోకి తొలిసారి తెలుగు మూలాలు ఉన్న మహిళ...