Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం

మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం
, శుక్రవారం, 2 జులై 2021 (09:13 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమయ్యాడు.
 
దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశం అయినట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
 
నాలుగు గంటల పాటు ఇవి చోటుచేసుకోగా ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ దీపక్‌ఝూ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వల్ప వ్యవధిలోనే 300 కిసాన్‌ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే