Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రాద్రిలో భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

Advertiesment
Surrender
, మంగళవారం, 15 జూన్ 2021 (21:14 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం కొత్తగూడెం ఎస్పీ ఎదుట సుమారు 19 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
 
వీరంతా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితోనే అడవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటుపై కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. తొలుత లొంగిపోయిన వారికి కరోనా టెస్టులు చేయించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో జూన్ 20వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగింపు