Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Advertiesment
crime scene

సెల్వి

, మంగళవారం, 4 మార్చి 2025 (12:23 IST)
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి ఆగ్రహావేశాలకు గురై ప్రాణాలు తీసేసుకోవడం.. దాడులు చేసుకోవడం, హత్యలు చేయడం ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కామన్ అయిపోయింది. తాజాగా భర్తను చంపి మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలో పూడ్చిపెట్టిందనే ఆరోపణలతో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దుబిఖల్ గ్రామంలో దుమారి ముండా (30)ను పోలీసులు నిందితురాలిగా గుర్తించారు. భర్తను చంపిన తర్వాత సుకిందా పోలీస్ స్టేషన్‌లో దుమారి లొంగిపోయింది. ఇంకా తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. 
 
దుమారి బాలాసోర్ జిల్లాకు చెందిన బాబులి ముండా (36)ను దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ఆ జంట దుబిఖల్‌లోని దుమారి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. అయితే, చిన్న చిన్న విషయాలకే నిరంతరం గొడవలు జరుగుతుండడంతో వారి సంబంధం దెబ్బతింది. గురువారం సాయంత్రం, దుమారి తల్లిదండ్రులు మార్కెట్‌కు వెళ్లగా, ఆ జంట ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. 
 
ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటల వివాదం చెలరేగి, ఆ తర్వాత తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. బాబులి దుమారిపై దాడి చేశాడని ఆరోపించారు. దీంతో కోపంతో, దుమారి అతనిపై కర్రతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే దుమారి దాడితో బాబులి మరణించాడు. దీంతో షాకైన దుమారి భర్త మృతదేహాన్ని వారి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు