భువనేశ్వర్, నబరంగ్పూర్ జిల్లాలో ఒక నెల వయసున్న ఒక పసికందును ఒక వ్యాధిని నయం చేయడానికి దాదాపు 40 సార్లు వేడి ఇనుప రాడ్తో వాత పెట్టారు. వివరాల్లోకి వెళితే.. చందహండి బ్లాక్లోని గంభరిగుడ పంచాయతీ పరిధిలోని ఫుండెల్పాడ గ్రామానికి చెందిన పసికందును వేడి ఇనుప రాడ్తో వాత పెట్టడంతో చికిత్స కోసం ఉమర్కోట్ సబ్-డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. నబరంగ్పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) సంతోష్ కుమార్ పాండా ఆసుపత్రిని సందర్శించి, శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
పిల్లల బొడ్డు మరియు తలపై దాదాపు 30 నుండి 40 వరకు వాతలు ఉంటాయి. వేడి ఇనుప రాడ్తో వాతలు పెడితే.. ఆ పిల్లవాడి వ్యాధులు నయమవుతాయనే మూఢనమ్మకంతో ఈ విధంగా చేశారని చెప్పారు. ఆ బిడ్డకు 10 రోజుల క్రితం జ్వరం వచ్చిందని, జ్వరం ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు.
ఆ పిల్లవాడు ఏదో దుష్ట ఆత్మ ప్రభావంలో ఉన్నాడని కుటుంబ సభ్యులు నమ్మారు. వైద్య సహాయం కోరే బదులు, కుటుంబం ఆ పసికందుపై 30-40 సార్లు హాట్ మెటల్తో వాతలు పెట్టిందని, దాంతో అది నయమవుతుందని నమ్మినట్లు తెలిపారు. కానీ ఆ పిల్లవాడు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, అతన్ని ఉమర్కోట్ ఆసుపత్రిలో చేర్చారు.
మారుమూల ప్రాంతాల్లో చాలా కాలంగా ఇటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయని సంతోష్ కుమార్ తెలిపారు.