Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైపూర్‌లో దారుణం - కడియాల కోసం కాళ్లు తెగనరికేశారు..

Advertiesment
knife
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (17:19 IST)
దేశంలో పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ శతాధిక వృద్ధురాలి కాళ్ళకు ధరించిన కడియాల కోసం రెండు కాళ్లను తెగనరికేశారు. ఈ దారుణం జైపూర్ నగరంలోని గాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో వందేండ్ల వృద్ధురాలి కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి దొంగ‌లు ఆమె రెండు కాళ్ల‌ను తెగ న‌రికేసి క‌డియాల‌ను ఎత్తుకెళ్లారు.
  
బ‌య‌టికి వెళ్లిన మ‌నుమ‌రాలు ఇంటికి వ‌చ్చేస‌రికి వృద్ధురాలు రెండు కాళ్ల‌ను కోల్పోయి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి బోరున విలపిస్తూ కనిపించింది. ఆ దృశ్యాల‌ను చూసి భ‌య‌ప‌డిపోయిన ఆమె వెంట‌నే త‌న త‌ల్లికి ఫోన్ చేసి విష‌యం చెప్పింది. 
 
ఇంతలో ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసుల‌కు సమాచారం చేరవేశారు. దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ హృద‌య‌విధార‌క ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్సికో నగరంలో విద్యార్థులపై విష ప్రయోగం