Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి... కేంద్రం

Advertiesment
కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి... కేంద్రం
, గురువారం, 17 మార్చి 2022 (14:19 IST)
కొత్తగా వెలుగు చూస్తున్న కొత్త కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిది. ముఖ్యంగా, చైనా, సౌత్ కొరియా, సింగపూర్‌‍తో పాటు మరికొన్ని ఐరోపియా దేశాల్లో కొత్త వైరస్ వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఇందులోభాగంగా జీనోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ రకాన్ని గుర్తించే పరీక్ష)ను పెద్ద ఎత్తున చేపట్టాలని, తద్వారా కొత్త వేరియంట్ల వ్యాప్తిని ముందుగానే గుర్తించవచ్చని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కేసుల హాట్‌స్పాట్‌లను గుర్తించేందుకు స్థానికంగా నిఘాను పెంచాలని ఆయన సూచించారు. 
 
కరోనా ఒమిక్రాన్ కేసులు గరిష్టాల నుంచి తగ్గుముఖం పట్టిన తర్వాత కోవిడ్ టాస్క్ ఫోర్స్ గురువారం ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో మాండవీయితో పాటు కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకేపాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ ఛీప్ డాక్టర్ బలరామ్ భార్గవ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఆర్ఆర్ఆర్" సినిమాకు టిక్కెట్లు పెంచుకోవచ్చు : పేర్ని నాని