Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీఎస్‌టీ 5 నుంచి 6 శాతానికి పెంపు

జీఎస్‌టీ 5 నుంచి 6 శాతానికి పెంపు
, శనివారం, 7 డిశెంబరు 2019 (08:54 IST)
లోటు ఆదాయంతో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఖజానా నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్లను పునర్‌ వ్యవస్థీకరించే యోచనలో ఉంది.

ప్రస్తుతం జీఎ్‌సటీలో నాలుగు (5,12,18,28 శాతం) పన్ను శ్లాబులున్నాయి. అందులో 5 శాతం శ్లాబు రేటు ను 6 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి జీఎ్‌సటీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల మేర పెరగవచ్చని అంచనా.

ఈ నెల 18న సమావేశం కానున్న జీఎ్‌సటీ మండలి ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ శ్లాబ్‌ రేటును పెంచితే నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆహారోత్పత్తులు, పాదరక్షలు, సామాన్యులు ఉపయోగించే వస్త్రాలన్నీ ఈ శ్లాబ్‌ పరిధిలోకే వస్తాయి.
 
మొత్తం వసూళ్లలో 5 శాతం వాటా
ప్రభుత్వానికొచ్చే మొత్తం జీఎ్‌సటీ ఆదాయంలో 5 శాతం శ్లాబ్‌ ద్వారా సమకూరే వాటా 5 శాతమే. నెలవారీ జీఎ్‌సటీ వసూళ్లను రూ.1.20 లక్షల కోట్ల స్థాయికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

కానీ, సెప్టెంబరులో జీఎ్‌సటీ ఆదాయం 19 నెలల కనిష్ఠ స్థాయి రూ.91,916 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. అక్టోబరులో రూ.95,380 కోట్లకు, నవంబరులో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో 9న విచారణ... మృతదేహాల అంత్యక్రియలకు బ్రేక్‌