Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

వేడిగా వున్న తారును బతికున్న కుక్కపై పోసేశారు.. చివరికి?

మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు

Advertiesment
Dog
, బుధవారం, 13 జూన్ 2018 (16:54 IST)
మానవత్వం మంటగలిసిపోతోంది. వేడిగా ఉన్న తారును బతికున్న శునకంపై వేసి రోడ్డేసిన దారుణ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. వేడి వేడి తారు మీద పడటంతో ఎంతో బాధతో విలవిలలాడుతున్నప్పటికీ.. రోడ్డు వర్కర్లు ఏమాత్రం కనికరం చూపలేదు.
 
చివరికి ఆ శునకం మృతి చెందింది. బతికున్న శునకంపైనే తారుపోస్తున్నారని స్థానికులు చెప్తున్నా.. కన్‌స్ట్రక్షన్ వర్కర్లు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అయితే మంగళవారం రాత్రి చీకటిలో రోడ్డు నిర్మాణం జరిగిందని.. రోడ్డు పక్కన ఉన్న కుక్కను వర్కర్లు గమనించకపోయి వుండవచ్చునని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే దీనిపై జంతు సంరక్షణ అధికారులు మండిపడుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పక్కనే శునకపు కాళ్లు వుండిపోయాయని.. కాసేపు బాధతో విలవిల్లాడిన శునకం ఆపై ప్రాణాలు కోల్పోయిందని గోవింద పరాషర్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. కానీ ఉదయానికల్లా కుక్క శవం కనిపించలేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంబీఏ చదివి దొంగతనం చేస్తావా? సిగ్గు లేదూ... ఆ డబ్బు, నగలు అక్కడ పెట్టేయ్... భార్య