Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో బిజీబిజీగా రజనీకాంత్.. నేడు అఖిలేష్‌తో భేటీ...

akhilesh - rajini
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (15:30 IST)
ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆదివారం మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేసిన రజనీకాంత్.. అఖిలేశ్ యాదవ్‌ను ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ వెంట ఆయన భార్య లత కూడా ఉన్నారు. అఖిలేశ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ చిత్ర పటం వద్ద రజనీకాంత్ నివాళులు అర్పించారు.
 
'ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తొమ్మిదేళ్ల క్రితం అఖిలేశ్ యాదవ్‌‌ను కలుసుకున్నాను. అప్పటి నుంచి మేము స్నేహితులం. ఫోన్‌‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఐదేళ్ల క్రితం నేను ఇక్కడకు షూటింగ్ కోసం వచ్చినప్పటికీ, కలుసుకోలేకపోయాను. అందుకని ఇప్పుడు కలిశాను' అని రజనీ మీడియా ప్రతినిధులతో అన్నారు. 
 
అఖిలేశ్‌తో సమావేశం ఎలా జరిగిందని ప్రశ్నించగా.. గొప్పగా జరిగిందని బదులిచ్చారు. ఇది మార్యాదపూర్వక భేటీయేనని, అఖిలేశ్ తన మిత్రుడని రజనీ పేర్కొన్నారు. తాను ఆదివారం లక్నో నుంచి అయోధ్య రాముడి దర్శనం కోసం వెళుతున్నట్టు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కలుస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ నో అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో పెరిగిన కోటీశ్వరుల సంఖ్య