తమిళనాడు ప్రజలు తమిళం మాట్లాడలేకపోతున్నానని.. ఇందుకోసం తనను క్షమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. తమిళం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి అని ఆయన అంగీకరించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
2024 సంవత్సరాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించిన అమిత్ షా, నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని పునరుద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలలో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు.
2026 తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా, రాజవంశ రాజకీయాలు, అవినీతిపై బిజెపి తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.