Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాకు మద్దతిచ్చారా? మేమెందుకు సపోర్ట్ చేయాలి?: పళనిసామి ప్రశ్న

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని తమిళనాడు సీఎం పళనిసామి స్వష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నాడీఎంకే అనుక్షణం సభను అడ్డుక

మాకు మద్దతిచ్చారా? మేమెందుకు సపోర్ట్ చేయాలి?: పళనిసామి ప్రశ్న
, గురువారం, 19 జులై 2018 (14:30 IST)
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని తమిళనాడు సీఎం పళనిసామి స్వష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నాడీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది. 
 
ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళ సీఎం పళనిసామి స్పష్టం చేశారు. కావేరి జలాలపై తమ పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని పళనిసామి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని పళనిసామి తేల్చి చెప్పారు. 
 
మరోవైపు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి.. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదని చెప్పారు. అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే అందులో పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో మాత్రం పాల్గొంటామని... విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్‌ల భారతం : ఇది 'రిపబ్లిక్ ఇండియా' లేదా 'రేప్‌ పబ్లిక్' దేశమా?