Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?

లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?
, మంగళవారం, 19 మార్చి 2019 (12:11 IST)
కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, ఆరోగ్యపురంకు చెందిన కెబిన్ రాజ్, సరణ్య దంపతులకు నాలుగేళ్ల రైనా అనే కుమారుడు వున్నాడు. శరణ్య అదే ప్రాంతానికి చెందిన ఆంటోనీ సామి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. 
 
ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆంటోనీ సామి శరణ్యతో వాగ్వివాదానికి దిగాడు. శరణ్య కూడా డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి బయట ఆడుకుంటున్న శరణ్య కుమారుడిని ఆంటోనీ సామి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రైనా మృతదేహమే కనిపించింది. దీంతో ఆంటోనీ సామిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ చేసిన ఆంటోనీనే ఆ బాలుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోర్కె తీర్చుకున్నావ్ కదా.. ఇకవదిలెయ్... ఎడిటర్‌ను హత్య చేసిన లేడీ రిపోర్టర్