Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

Advertiesment
deadbody

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (13:13 IST)
బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ సరదా నలుగురు ప్రాణాలు తీసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఖగారియా జిల్లో సంభవించింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. వీరిలో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. జిల్లాలోని పర్చట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువాని ఘాట్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. 
 
మైనర్ యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని స్థానికులు రక్షించగలిగారని చెప్పారు. నీటిలో మునిగిన నలుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు. నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోయారని, ప్రమాదాన్ని గుర్తించక రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్చట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. 
 
మునిగిపోయినవారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎసీడీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. చనిపోయినవారి పేర్లు నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16)గా వెల్లడించారు. శ్యామ్ కుమార్ (24) అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి (16) ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్