Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేదువార్త చెప్పిన గూగుల్ ప్లే.. వచ్చే యేడాది నుంచి...

చేదువార్త చెప్పిన గూగుల్ ప్లే.. వచ్చే యేడాది నుంచి...
, శుక్రవారం, 27 నవంబరు 2020 (07:43 IST)
ప్రముఖ నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పే ఇపుడు తన వినియోగదారులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే యేడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవల నిలివేయనున్నట్లు ప్రకటించింది. 
 
అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకుగాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటివరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగించే వారు. అలాగే, ఎలాంటి రుసుంను కూడా గూగుల్ వసూలు చేసేది కాదు. కానీ వచ్చే యేడాది నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
 
'2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్‌ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. 
 
గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​ - టూ - పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే యేడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీంతో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. 
 
ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బల్దియా ఎన్నికలు : 28న హైదరాబాద్‌ వస్తున్న నరేంద్ర మోడీ