Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో గోవిందా... ఖర్చు తగ్గించాలని...?

FM Radio
, సోమవారం, 8 మే 2023 (15:42 IST)
FM Radio
భారత్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం కనుమరుగైంది. దీంతో భారత సర్కారు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎ‌మ్ రేడియో వుండి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తలపట్టుకున్నాయి. 
 
దేశంలోని చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి. కెమెరా, ఇంటర్నెట్, ఫింగర్ సెన్సార్, జీపీఎస్ వంటి అనేక ఫీచర్లతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం లేకుండానే విడుదలవుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లలో రేడియో శ్రోతల సంఖ్య తక్కువగా ఉన్నారు. అయితే రేడియోకు అలవాటు పడిన శ్రోతలు ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రేడియోను వింటున్నారు.  
 
ఇందుకు కారణం ఖర్చులను తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు FM చిప్‌సెట్‌లకు దూరంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లు రేడియోకు దూరంగా వుంటున్నాయి. కానీ ఎఫ్‌ఎం సదుపాయాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, భారతదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేసే చిప్‌సెట్‌ను అమర్చాలని, ఎఫ్‌ఎమ్ రేడియో సౌకర్యాన్ని అందించాలని చెప్పబడింది. 
 
ఈ ఫీచర్‌ను తొలగించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుమతి లేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎం రేడియో సేవలను విస్తరిస్తున్న తరుణంలో రేడియో వినే అలవాటును ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతుండడం గమనార్హం. అలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎమ్‌ను సదరు కంపెనీలు తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లవారితో పెళ్లి.. అక్క భర్తతో లేచిపోయిన వధువు.. ఎక్కడ?