Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా భద్రతకు ముప్పు.. అందుకే యాప్‌లపై నిషేధం : చైనాకు భారత్ సమాధానం

మా భద్రతకు ముప్పు.. అందుకే యాప్‌లపై నిషేధం : చైనాకు భారత్ సమాధానం
, సోమవారం, 13 జులై 2020 (18:09 IST)
జాతీయ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందన్న కారణంగానే చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించినట్టు భారత్ మరోమారు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని చైనా దౌత్యాధికారులకు కూడా సూటిగా చెప్పేసింది. 
 
గాల్వాన్ లోయ వివాదం తర్వాత సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వినియోగంలో ఉన్న టిక్ టాక్, హలో సహా 50 చైనా మొబైల్ యాప్‌లను గత జూన్ 29న భారత్ నిషేధించిన విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో తమ దేశానికి చెందిన 59 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన అంశాన్ని ఇటీవల న్యూఢిల్లీతో జరిపిన చర్చల్లో చైనా ప్రస్తావించింది. దౌత్య స్థాయిలో జరిగిన సమావేశంలో తమ మొబైల్ అప్లికేషన్లను నిషేధించడంపై చైనా ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 
 
ఇందుకు భారత్ ధీటుగా సమాధామిచ్చిందనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, భద్రతాంశాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని, తమ పౌరుల డాటాకు సంబంధించిన అంశాల్లో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
దేశంలోని యూజర్ డాటాను సేకరించి, దానిని బయటకు పంపించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!