Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొట్టమొదటి డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌

Tablet
, బుధవారం, 22 జూన్ 2022 (23:46 IST)
అసుస్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) నేడు ఫ్లో జెడ్‌ శ్రేణిని భారతదేశంలోని తమ ఆర్‌ఓజీ వ్యవస్థ కోసం పరిచయం చేసింది. దీనిలో భాగంగా ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసింది. పరిశ్రమలో మొట్టమొదటి డిటాచబల్‌ 2-ఇన్‌-1 గేమింగ్‌ట్యాబ్లెట్‌ ఇది. ఈ ట్యాబ్లెట్‌ను రిఫ్రెష్డ్‌ టీయుఎఫ్‌ డాష్‌ ఎఫ్‌ 15 2022 మోడల్‌తో పాటుగా విడుదల చేశారు. ‘ఒన్‌ డివైజ్‌. ఇన్ఫినైట్‌  పే’ల సిద్ధాంతంతో ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13, శక్తివంతమైన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ శక్తిని నిలుపుకుంటుంది.

 
దీనిలో 14 కోర్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ9-12900 హెచ్‌ సీపీయు, జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 3050 టీఐజీపీయుతో నివిడియా కలిగిన అత్యంత శక్తివంతమైన గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఇది. బాహ్య జీపీయు, ఎక్స్‌జీమొబైల్‌‌తో రావడంతో పాటుగా 4కె 60హెర్ట్జ్‌ మరియు ఎఫ్‌హెచ్‌డీ 120 హెర్ట్జ్‌ టచ్‌ ప్యానెల్‌ అవకాశాల నుంచి ఎంచుకునే అవకాశం ఉంది. దీనిలో సూపర్‌లైట్‌ 1.1కేజీ ఛాసిస్‌ ఉంది. ఆర్‌ఓజీ ఫ్లో జె 13తో పాటుగా అసుస్‌, తమ టీయుఎఫ్‌ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ నూతన టీయుఎఫ్‌ డాష్‌ ఎఫ్‌ 15 విడుదల చేసింది.

 
పూర్తిగా పునరుద్ధరించిన టీయుఎఫ్‌ డ్యాష్‌ ఎఫ్‌ 15 ఇప్పుడు స్వచ్ఛమైన, మరింత ప్రొఫెషనల్‌ లుక్‌ను విప్లవాత్మకంగా మిళితం చేసిన సీపీయు మరియు జీపీయు కలిగి, ప్రయాణ సమయంలో కూడా మెరుగైన గేమింగ్‌ డివైజ్‌ కావాలనుకునే వినియోగదారులకు ఖచ్చితమైన ఉపకరణంగా నిలుస్తుంది. ఆర్‌ఓజీ ఫ్లోజె 13, టీయుఎఫ్‌ డ్యాష్‌ 15లు వరుసగా 1,36,990 రూపాయులు, 90,990 రూపాయలలో లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరద్‌ పవార్‌పై వ్యాఖ్యలు : మరాఠీ నటి కేతకి చితాలేకు బెయిల్