Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సహనం - సమయస్ఫూర్తితో సింహాల గుంపుకు పరీక్ష పెట్టిన జిరాఫీ... ఎక్కడ?

సహనం - సమయస్ఫూర్తితో సింహాల గుంపుకు పరీక్ష పెట్టిన జిరాఫీ... ఎక్కడ?
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:44 IST)
ఆ జిరాఫీకి సహనం ఎక్కువు. అంతకంటే.. మంచి సమయస్ఫూర్తి. ఫలితంగా తనపై దాడి చేసిన సింహాల గుంపుకే పరీక్ష పెట్టింది. ఇదీ గంటో అరగంటో పరీక్ష కాదు.. ఏకంగా ఐదు గంటల పరీక్ష. ఈ పరీక్షలో సింహాల గుంపు తోకముడుచుకుని పారిపోయాయి. ఫలితంగా ఆ జిరాఫీ ప్రాణాలను దక్కించుకుంది. ఈ అరుదైన దృశ్యం సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఆవిష్కృతమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ జాతీయ పార్కులో కనిపించిన ఈ అరుదైన ఘటనను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి నవీద్ ట్రుంబో తనకు అందిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి షేర్ చేశాడు. 'ఈ వీడియో మనకు ఓ పాఠాన్ని నేర్పుతోంది. క్రూరంగా తనపై దాడి చేస్తున్న వేళ, 5 గంటల పాటు ఈ జిరాఫీ బెదరకుండా నిలబడిపోయింది. దేన్నైనా సాధించాలంటే ఓపిక ముఖ్యమని జిరాఫీ నిరూపించింది' అని ఆయన కామెంట్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. 
 
కాగా సమయస్ఫూర్తికి సహనం తోడైతే ఇక తిరుగే వుండదన్న విషయాన్ని ఈ జిరాఫీ విషయంలో తేటతెల్లమైంది. తనపై కొన్ని సింహాల గుంపు దాడి చేసినా.. ఏమాత్రం బెదరకుండా, పారిపోకుండా సమయస్ఫూర్తితో, ఓర్పు, సహనంతో ఏక బిగువున ఐదు గంటల పాటు నిలబడి తన ప్రాణాలను ఓ జిరాఫీ రక్షించుకుంది. 
 
సింహాల గుంపు దాని శరీరంపై పడి దొరికిన భాగాన్ని దొరికినట్టు కొరుకుతూ ఉన్నా, ఆ బాధను ఓర్చుకుంటూ.. సహనంతో నిలబడి, ప్రాణాలతో బయటపడింది. ఆ జిరాఫీ ఎంతకూ కింద పడకపోవడంతో సింహాలు చేసేదేమీ లేక, దాన్ని వదిలేసి వెనక్కు వెళ్లిపోయాయి. ఆ వీడియోనూ మీరూ చూడండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్‌ధన ఖాతాల్లోని సొమ్ము వెనక్కి... ఎవరికి.. ఎక్కడ?