Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌదీ మహారాజు కానున్న ఎంబీఎస్.. ట్రంప్ అభినందనలు

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టాభిషేకం చేసే సంప్రదాయం అమ‌లులో ఉంది. ఆ ట్రెండ్‌కు కింగ్‌ సల్మాన

Advertiesment
Saudi Arabia
, శనివారం, 18 నవంబరు 2017 (13:22 IST)
సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టాభిషేకం చేసే సంప్రదాయం అమ‌లులో ఉంది. ఆ ట్రెండ్‌కు కింగ్‌ సల్మాన్ స్వ‌స్తి చెప్ప‌బోతున్నారు.

అయితే, కింగ్ స‌ల్మాన్ ''మసీదుల సంరక్షకుడు" అనే హోదాలో కొనసాగ‌బోతున్నార‌ని సమాచారం. సౌదీ యువరాజు ప‌ట్టాభిషేకంపై సౌదీ ప్ర‌భుత్వం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క ముందే ఎంబీఎస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలిపిన‌ట్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
ఇటీవల సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 11మంది యువరాజులతో పాటు మాజీ మంత్రులు, ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ కుటుంబంలో రాజ్య‌మేలుతున్న అవినీతిని అంత‌మొందించేందుకే ఎంబీఎస్ అరెస్టుల వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం కింగ్ సల్మాన్ తన కుమారుడు ఎంబీఎస్ సింహాసనాన్ని అప్పగించనున్నారని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా సౌదీ అరేబియా రాజ‌కుటుంబంలో అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రాచరిక వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోవడంతో అధికారాన్ని ఎంబీఎస్ చేజిక్కించుకున్నాడు. తానే ఛైర్మన్‌గా అవినీతి- నిరోధక గ్రూప్‌‌ను ఏర్పాటు చేసి అక్ర‌మార్కుల‌ భ‌ర‌తం ప‌ట్టాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్