Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బారాబంకిలోని బీజేపీ కౌన్సిలర్ రంజీత్ కుమార్ శ్రీవాస్తవ తన భార్య శశి శ్రీవాస్తవను బరిలోకి

Advertiesment
vote
, శనివారం, 18 నవంబరు 2017 (13:00 IST)
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బారాబంకిలోని బీజేపీ కౌన్సిలర్ రంజీత్ కుమార్ శ్రీవాస్తవ తన భార్య శశి శ్రీవాస్తవను బరిలోకి దింపారు. ప్రచారంలో భాగంగా ముస్లింలను ఉద్దేశించి రంజీత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నా భార్యకు ఓటేయండి.. లేకపోతే గతంలో ఎన్నడూ లేనన్ని కష్టాలు అనుభవిస్తారు" అంటూ పబ్లిగ్గా హెచ్చరించారు.  
 
ముస్లింలకు చెపుతున్నాని... తాను అడుక్కోవడం లేదని.. ఓటేస్తే మీరు ప్రశాంతంగా జీవిస్తారని.. లేకుండా కష్టాలెంటో చూస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈవ్యాఖ్యలు యూపీలో సంచలనం రేపుతున్నాయి. 
 
ఇది సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం కాదని.. నాయకులెవ్వరూ సాయం చేయలేరని రోడ్లు, నాలాల మరమ్మత్తుల్లో పాటు ఇంకా చాలా ప నులు సంస్థల చేతిల్లోనే వుంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజయంలో మరింత సాయం చేయండని.. తద్వారా ఎదుర్కునే సమస్యల నుంచి తప్పించుకోండని ముస్లింలకు రంజిత్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జీ సేవలను ప్రారంభించనున్న ఎయిర్‌టెల్..