Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎండుద్రాక్ష తింటే బరువు పెరుగుతారా? ఈ 5 పాయింట్లు తెలిస్తే?

ఎండుద్రాక్ష తింటే బరువు పెరుగుతారా? ఈ 5 పాయింట్లు తెలిస్తే?
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:23 IST)
ఎండు ద్రాక్ష కొంతవరకు తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి. వాస్తవానికి ఇందులో వుండే రిచ్ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్ష ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.
 
1. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. రోజు మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
2. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తంలోకి త్వరగా చేరుతుంది.
 
3. ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కారణం అయ్యే టోమర్ సెల్స్‌తో పోరాడే గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
4. దీనిలో గ్లూకోజ్, విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్‌ను కలిగి వుంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తరుచుగా తినడం వలన శరీరంలో పులుపును స్వీకరంచే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రాకుండా చేస్తుంది.
 
5. ఎండుద్రాక్ష తినడం వలన  శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం వున్నవారు పుచ్చకాయలను తినవచ్చా?