Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Advertiesment
drinking water

సిహెచ్

, శుక్రవారం, 20 జూన్ 2025 (21:40 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు  తాగాలి.
యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది.
ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి.
ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.
మహిళల విషయంలో రుతుస్రావ నొప్పులు రాకుండా మేలు జరుగుతుంది.
మలాసనం వేయడం వల్ల పిరుదలు, నడుము భాగం మరింత చురుకుగా మారుతుంది.
ఫలితంగా ఎక్కువ పనిగంటల పాటు కుర్చీలో కూర్చుని పనిచేసేవారికి ఇది మేలు చేస్తుంది.
మలాసనం శరీరాన్ని శక్తివంతం చేయడంలో దోహదపడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...