Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాల్షియం కావాలా నాయనా... ఐతే ఇవి తీసుకోవాల్సిందే...

ఈ రోజులలో చాలామందికి ఎముకలు బలహీనంగా ఉండి కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. దీనివలన ఎముకలు పెళుసుగా మారిపోతాయి. దీనిని భర్తీ చేయాలంటే కాల్షియ

క్యాల్షియం కావాలా నాయనా... ఐతే ఇవి తీసుకోవాల్సిందే...
, సోమవారం, 21 మే 2018 (19:54 IST)
ఈ రోజులలో చాలామందికి ఎముకలు బలహీనంగా ఉండి కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు లేకపోవటమే. దీనివలన ఎముకలు పెళుసుగా మారిపోతాయి. దీనిని భర్తీ చేయాలంటే కాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహార పదార్ధాలను, పాల ఉత్పత్తులను రోజువారి చేర్చుకోవటమే.
 
1. పాలు, పెరుగు, జున్నులో కాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
2. రాగి పిండిని జావా లాగా చేసి ప్రతి రోజు త్రాగటం వలన దానిలో ఉన్న పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, పిల్లలలో ఎముకల పెరుగుదలకు కావలసిన కాల్షియంను అందిస్తాయి.
 
3. పాలకూర, తోటకూర, బ్రోకలి లాంటి ఆకుకూరల్లో డి విటమిన్, కాల్షియం ఎక్కువుగా ఉండి అది ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. కనుక వారంలో మూడుసార్లయినా ఆకు కూరలను తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. 
 
4. యాలుకలలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని ప్రతిరోజు త్రాగటం వలన ఎముకలు ధృడంగా తయారవుతాయి.
 
5. అంజీరపండ్లను, నారింజ పండ్లను క్రమంతప్పకుండా తీసుకోవాలి. దీనిలో ఉన్న కాల్షియం రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు గృహాలంకరణల చిట్కాలు