Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిరియాల పొడిని నెయ్యిలో వేసుకుని తీసుకుంటే? ఫలితం ఏమిటి?

మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత

Advertiesment
health
, శనివారం, 19 మే 2018 (11:54 IST)
మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. మిరియాలు కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
 
మిరియాలను వేయించి వాటిని పొడిచేసి నెయ్యిలో కలుపుకుని తింటే గొంతు బాధలు తగ్గుటకు ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్లీరయల్ గుణాలు, ఎక్కువగా ఉంటాయి. 
 
నెయ్యిలో మిరియాలు కలిపి తినడం వలన తీవ్రమైన జలుబుకు, దగ్గుకు, గొంతు నొప్పికి ఈ వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధలు తగ్గిపోతాయి. తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది. మతిభ్రమ, మూర్చ, లాంటి వ్యాధులు ఉన్నవారు మిరియాల ఘూటును పీల్చుకుంటే చాలా మంచిది.
 
రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక క్రిములను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొక్కులేని మామిడి పండ్లతో కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఎలా?