Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేక్, కుకీస్, క్యాండీస్ వద్దు.. మధుమేహ రోగులకు ఎండుద్రాక్షలే మేలు- టిప్స్

బాదంలను తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్తేజ పరుస్తాయి. ఇంకా రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. బటర్ నట్స్ అనే వైట్ నట్స్ అని కూడా అంట

Advertiesment
Foods
బాదంలను తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్తేజ పరుస్తాయి. ఇంకా రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. బటర్ నట్స్ అనే  వైట్ నట్స్ అని కూడా అంటారు. ఇవి మోనోసాచురేటెడ్ ఫాటీ ఆసిడ్‌లను ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లను కలిగి ఉండి, టైప్-2 డయాబెటిస్ వలన వచ్చే క్లిష్ట సమస్యలను తగ్గిస్తాయి.
 
ఆక్రోటుకాయలు ఎక్కువ స్థాయిలో మోనో, పాలీ అన్ సాచురేటేడ్ ఫాట్‌లను కలిగి ఉండి శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. తద్వారా చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రోజు పిస్తాలను తినటం వలన శరీరంలో పెరిగే కార్బోహైడ్రేట్‌ల స్థాయిలు సాధారణ స్థితిలో లేదా వాటి పెరుగుదలను ఇవి తగ్గిస్తాయి. శరీర రక్తంలోని చక్కర స్థాయిలు పెరిగేందుకు శరీరంలో కార్బోహైడ్రేడ్ల సంఖ్య పెరగడమే కారణం.
 
జీడిపప్పులోని మోనోసాచురేటేడ్ ఫాట్‌లు శరీరంలో ట్రై-గ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫాట్‌లను తగ్గించి, మధుమేహ వ్యాధి గ్రస్తులలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. గుండెజబ్బును తగ్గిస్తాయి. 
 
పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్‌లను అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుపడతాయి. రోజూ అరకప్పు పప్పును ఆహారంతో కలిపి తీసుకోవాలి. పిండిపదార్థాలు గ్లూకోజ్ స్థాయిలు అధికంగా గల వైట్ బ్రెడ్‌ను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోకూడదు. ఇలాంటి వైట్ బ్రెడ్‌ల నుండి వచ్చే కార్బోహైడ్రేట్లను తీసుకోవడం కంటే వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు
 
కేక్‌, రొట్టెలలో షుగర్, సోడియం, తీపి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇలా చక్కెర స్థాయిలు పెరగటం వలన ఇన్ఫ్లమేషన్‌లు కలుగవచ్చు. వీటివలన శరీరంలో కొవ్వు స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది. వేయించిన ఆహారాల అయినట్టి బంగాళదుంప, ఫ్రెంచ్ ఫ్రైలు మధుమేహ వ్యాధి గ్రస్తులలో బరువును పెంచుతాయి. అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫాట్, కార్బోహైడ్రేట్ మరియు స్టార్చ్‌ల వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను పెంచుతాయి. 
 
కేక్, కుకీస్, క్యాండీస్ వంటి వాటితో పోలిస్తే ఎండిన ద్రాక్షలు ఉత్తమం అని చెప్పవచ్చు. కానీ ఇవి కూడా రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతాయి. స్నాక్స్‌గా ద్రాక్ష పండ్లు, స్ట్రాబెర్రీ వంటి వాటిని తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెంతి పొడిని పెరుగు లేదా మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?