Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహంతో బాధపడేవారు అరటిపండ్లు తీసుకోవచ్చా?

Advertiesment
Diabetes
మధుమేహంతో బాధపడేవారు అరటిపండ్లను తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మ‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెరుగుతాయి.


మ‌ళ్లీ ఆ స్థాయిలు త‌గ్గాలంటే అందుకు లివ‌ర్‌, మూత్ర‌పిండాల‌పై అధిక భారం ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. లేదంటే చ‌క్కెర స్థాయిలు పెరిగి త‌రువాత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అలాగే అధిక బ‌రువు ఉన్న వారు, స్థూల‌కాయులు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బ‌రువు పెరుగుతారు. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
అలాగే అర‌టి పండ్ల‌లో థ‌యామిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్న‌వారికి మంచిది కాదు. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది.

ముఖ్యంగా అల‌ర్జీ స‌మ‌స్య ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌రాదు. తింటే ముఖం, ఇత‌ర శ‌రీర భాగాలు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి. దుర‌ద కూడా ఉంటుంది. క‌నుక అలాంటి వారు అర‌టిపండ్ల‌ను మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయంత్రం పూట 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే?