Publish Date: Sun, 26 Feb 2023 (22:36 IST)
Updated Date: Sun, 26 Feb 2023 (22:38 IST)
ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ద్రాక్ష మితిమీరి తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము.ద్రాక్షలో సాలిసిలిక్ ఆసిడ్ వుంటుంది, ద్రాక్షను మితిమీరి తింటే కడుపు గడబిడ అవుతుంది. ద్రాక్షలో క్యాలరీలు అధికంగా వుంటాయి, ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. గర్భం ధరించినవారు కూడా మోతాదుకి మించి ద్రాక్ష తింటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుంది.
మోతాదుకి మించి ద్రాక్షను తింటే 12 ఏళ్ల లోపు పిల్లలను ఇవి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం వుంది.
ద్రాక్షలో లిపిడ్ ట్రాన్సఫర్ ప్రోటీన్ కారణంగా అధిక మోతాదులో తింటే అలెర్జీలు రావచ్చు.