Publish Date: Fri, 14 May 2021 (22:56 IST)
Updated Date: Fri, 14 May 2021 (22:57 IST)
ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార్థాలు తగ్గించాలి. ఆరోగ్యవంతులు రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు.
క్యాల్షియం, ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ప్రోటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.
సిహెచ్
Publish Date: Fri, 14 May 2021 (22:56 IST)
Updated Date: Fri, 14 May 2021 (22:57 IST)