Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్జూరాలతో పండంటి పాపాయి...

ఖర్జూరాలతో పండంటి పాపాయి...
, బుధవారం, 12 మే 2021 (20:13 IST)
పోషకాంశాలు పుష్కలంగా వున్న ఖర్జూరంలో అపారమైన ఔషధ శక్తులున్నాయి. అతి తక్కువ సమయంలో రక్తంలో చేరి త్వరగా శక్తిని ప్రసాదించే ఆహార పదార్థాలలో ఖర్జూరం ప్రముఖ స్థానం పొందింది.
 
రక్తవృద్ధికి.. రాత్రి పడుకునే ముందు 100 మి.లీ నీటిలో రెండు ఎండు ఖర్జూరం కాయలను నలగ గొట్టి పెచ్చులు పొట్టు తీసిన మూడు లేదా నాలుగు బాదం పప్పులు, 15 వరకూ ఎండుద్రాక్షలు వేసి ఉదయం వాటన్నిటిని నమిలి మ్రింగి మిగిలిన నీరు తాగేయాలి. ఐతే బాదం పప్పులను ఒక గంట వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటి పొట్టు తొలగించి కలుపుకోవాలి.
 
గర్భిణీలకు... ఖర్జూరం పెచ్చులపొడి, బాదం పప్పును కొద్దిగా నేతితో వేయించి చేసిన పొడి, ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి 100 గ్రాములు, యాలక్కాయల పొడి 20 గ్రాములను తీసుకుని మిక్సీలో వేసి బాగా కలిపి నిలవ వుంచుకుని రోజూ రెండుసార్లు పూటకి ఒక టీ స్పూన్ పొడిని, తగినంత పటిక బెల్లం పొడిని 100 మి.లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుంటే గర్భిణులు ఆరోగ్యంగా వుండటమే కాకుండా ఆరోగ్యవంతమైన పండంటి పాపాయికి జన్మనిస్తారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇతరులకు ఉపయోగపడే వాడిని కూడా ఉపయోగపడకుండా చేస్తాడు