Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు పెరగకూడదా.. పెరిగినా పర్లేదు.. ఇవి తింటే చాలు..?

Advertiesment
Food
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:04 IST)
బరువు పెరగకుండా వుండాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు. అంతేగాకుండా పెరిగిన బరువును కూడా ఈ ఆహారం తగ్గిస్తుంది. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేపలు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో హానికర ట్రైగ్లిజరైడ్లను చేరకుండా అడ్డుకుంటాయి. 
 
కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలోని కొవ్వులోనే ఉంటాయి. కనుక కొవ్వు పట్టిన సాల్మన్, సార్ డైన్, టూనా వంటి చేపలు తినడం మంచిది. కాకపోతే వీటిని కూరగా వండుకునే తినాలి కానీ, నూనెలో వేయించుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.
 
చిరుతిళ్లుగా బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఓ గుప్పెడు తింటే చాలు. వీటిలో కూడా కొవ్వును తగ్గించే గుణాలు ఎక్కువ. కాకపోతే అధికంగా తింటే మాత్రం కొవ్వు పట్టేస్తుంది. వీటి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.
 
బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో దోశెలు, పూరీలు, బోండాలు తినడం మానేస్తే అధిక బరువు సమస్య ఎదురుకాదు. బ్రౌన్ రైస్, జొన్నలు, ఓట్స్, సజ్జలు వంటి చిరు ధాన్యాలతో చేసిన వంటకాలు తింటే త్వరగా ఆకలి వేయదు. కాబట్టి అధికంగా తినే అవకాశం ఉండదు, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
 
 ఏమి తిన్నా కూడా బరువు తగ్గడానికి ఎక్కువ సాయం చేసేది వ్యాయామం. తినేసి కూర్చుంటే ఎవరైనా బరువు పెరుగుతారు. రోజులో ఒక గంట పాటూ వేగంగా నడక అలవాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల పక్షవాతం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.
 
ఒత్తిడి... ఆధునిక కాలంలో ఎక్కువమంది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్న మహమ్మారి ఇది. అధిక ఒత్తిడి బరువు పెరిగేందుకు కూడా సహకరిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువ కావచ్చు. అందుకే ధ్యానం, యోగా లాంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేరియాకు టీకా : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం