Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతడితో నీకు లింకుందని భర్తతో చెపుతామని బెదిరించి మహిళపై ఇద్దరు అత్యాచారం

అతడితో నీకు లింకుందని భర్తతో చెపుతామని బెదిరించి మహిళపై ఇద్దరు అత్యాచారం
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:34 IST)
హైదరాబాద్ నగరంలోని బోరబండలో దారుణం జరిగింది. ఓ వివాహితకు మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు యువకులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బోరబండలో ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయాన్ని యాసీన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు యువకులు పసిగట్టారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వివాహిత చెప్పి కోర్కె తీర్చకపోతే భర్తకు చెపుతామని బెదిరించారు. దీనితో ఆమె వారికి లొంగిపోయింది. ఐతే వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో వివాహిత తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది.

 
వికారాబాద్ అడవుల్లో పురుగుల మందు తాగి అపస్మారకంలో వుండగా గమనించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహితపై బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్ పై మండిపడ్డ వాసిరెడ్డి పద్మ