Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగలు ఎత్తుకెళ్లబోయాడు, పిన్ని అరిచేసరికి తనతో సంబంధం పెట్టుకున్నదంటూ...

Advertiesment
నగలు ఎత్తుకెళ్లబోయాడు, పిన్ని అరిచేసరికి తనతో సంబంధం పెట్టుకున్నదంటూ...
, బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:46 IST)
తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎవరూ లేకుండా అనాధగా మారిన యువకుడిని ఇంటికి పిలిపించుకున్నాడు బాబాయ్. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నారు. పిన్నితోనే ఏకంగా శారీరక బంధాన్ని ఏర్పరచుకుని ఇంట్లో ఆస్తి కాజేయాలని చూశాడు. నగలు, నగదు ఎత్తుకెళుతూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసముంటున్న వెంకటేష్, మధురిమలకు ఇరవై యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. బాగా సంపాదించాడు. పిల్లలు లేరన్న బాధ వీరిలో ఎప్పటి నుంచో ఉంది.

 
అయితే ఈ మధ్య తమ బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారి కొడుకు 17 యేళ్ళ పురుషోత్తంను ఇంటికి తీసుకొచ్చాడు వెంకటేష్. తల్లిదండ్రులుగా మమ్మల్ని భావించి ఇక్కడే ఉండు. బాగా చదువుకో.. మీకు మేము అండగా ఉంటామని చెప్పాడు. 

 
బుద్ధిగా చదువుకోవాల్సిన ఆ యువకుడు ఏకంగా పిన్నిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. లోబరుచుకున్నాడు. అయితే డబ్బులతో పాటు నగలు అన్నీ కూడా పిన్ని దగ్గరే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఎలాగైనా వాటిని కొట్టేయాలనుకున్నాడు. పని మీద రెండురోజుల పాటు బయటకు వెళ్ళాడు వెంకటేష్.

 
ఇదే అదుపుగా భావించి నగలు, నగదును ఎత్తుకెళదామనుకున్నాడు. పురుషోత్తం గురించి అర్థం చేసుకుని తేరుకున్న పిన్ని ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. స్థానికులను గట్టిగా కేకలు వేస్తూ పిలిచింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎలాగో తాను దొరికిపోయాను కాబట్టి పిన్ని విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు పురుషోత్తం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలాజీ జిల్లా కాదు తిరుపతి జిల్లా, నగరి బాలాజీ జిల్లాలోనే, సీఎంను కలుస్తా: రోజా