Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేప తెచ్చిన గొడవ.. యువకుడి దారుణ హత్య

చేప తెచ్చిన గొడవ.. యువకుడి దారుణ హత్య
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:04 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో డొంబివిలిలో ఓ దారుణం జరిగింది. చేపనను విక్రయించడంలో ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ కేసులో బంధువును హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిందితుడు హితేష్‌ సంజయ్ నఖ్వాల్‌ తన బంధువైన భానుదాస్‌ అలియాస్‌ ముకుంద్‌ దత్త చౌదరి (55)తో చేపను విక్రయించే విషయంపై శనివారం గొడవపడ్డాడు. 
 
దీంతో తన బంధువును డోంబివిలీ పట్టణంలోని ఖంబల్‌పాడలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హితేష్... పదునైన ఆయుధంతో అతని మెడపై దాడి హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. 
 
పోస్టుమార్టం నిమిత్తం భానుదాస్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాళ్ళబస్తీలో యువతి అదృశ్యం