Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకను సస్పెండ్ చేసిన ఐసీసీ

Advertiesment
sri lanka
మాజీ వన్డే, టీ20 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది.
 
జట్టు నిర్వహణ కోసం మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల తాత్కాలిక బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా విభాగం అధికారికంగా ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టును ఐసీసీ సస్పెండ్ చేసింది. "ఐసీసీలో పూర్తికాల సభ్యుడైన శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను ధిక్కరించి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే గ్రాచికా బోర్డును సస్పెండ్ చేశాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలు స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలి. అలాగే, ప్రభుత్వ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఐసీసీ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రచిన్ రవీంద్ర వీడియో వైరల్.. బామ్మ దిష్టి తీస్తుంటే ..?