Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ - కెప్టెన్‌గా రిషబ్ పంత్

rishabh panth
, గురువారం, 9 జూన్ 2022 (07:18 IST)
భారత, దక్షిణాఫ్రికా జట్లు మధ్య గురువారం నుంచి ట్వంటీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరంగా కాగా, గజ్జల్లో గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరూ జట్టుకు దూరమయ్యారు. 
 
ఫలితంగా భారత జట్టు పగ్గాలను కీపర్ రిషబ్ బంత్‌కు అప్పగించారు. అలాగే, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇచ్చినట్టు బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడిపైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్‌కు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చేతికి బంతి తగిలి గాయమైందని బీసీసీఐ తెలిపింది. 
 
భారత్ టీ20 జట్టు ఇదే.. 
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఖాతాలో కొత్త రికార్డ్