Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
, ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:01 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గతంలో కంటే ఇపుడు ఈ సంఖ్య బాగా తగ్గింది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. 
 
వీటిలో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 338 మంది మృతిచెందారని తెలిపింది.
 
ఇకపోతే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20,487 కేసులు ఉన్నాయని, 181 మంది మరణించారని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13న సమావేశంకానున్న కృష్ణా - గోదావరి నదీ యాజమాన్య బోర్డు