Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ జగమొండిది.. 19 సార్లు పరీక్షల తర్వాత పాజిటివ్... ఎక్కడ?

కరోనా వైరస్ జగమొండిది.. 19 సార్లు పరీక్షల తర్వాత పాజిటివ్... ఎక్కడ?
, బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జగమొండిదని తెలుస్తోంది. కొందరికి పదుల సంఖ్యలో పరీక్షలు చేస్తున్నప్పటికీ ఈ వైరస్ లక్షణాలు బయటపడటం లేదు. తాజాగా ఓ మహిళకు ఏకంగా 18 సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయినప్పటికీ బయటపడలేదు. చివరకు 19వ దఫాలో జరిపిన పరీక్షల్లో ఈ వైరస్ బయటపడింది. ఈ పరిస్థితుపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేర‌ళ‌ రాష్ట్రంలోని ప‌త‌న‌మిట్ట ప్రాంతానికి చెందిన ఓ 62 యేళ్ల మహిళతో పాటు.. ఆమె కుటుంబ సభ్యలు గత ఫిబ్రవరి నెలలో ఇటలీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వీరంతా సాధారణ జీవనం గడుపుతూ వచ్చారు. వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదుగురికి నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. 
 
వీరిలో 62 యేళ్ళ మహిళకు కూడా ఇదే తరహా ఫలితం వచ్చింది. కానీ, ఆమెలో కరోనా లక్షణాలు కనిపించసాగాయి. దీంతో ఏకంగా 18 సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయినప్పటికీ ఈ జగమొండి కరోనా బయటపడలేదు. దీంతో మరోమారు అంటే 19వ సారి పరీక్షచేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీనిపై వైద్యులు స్పందిస్తూ, 'ఇప్ప‌టివ‌ర‌కు ఆమెలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు. కాంబినేష‌న్ డ్రగ్స్‌ను మేం చాలాసార్లు ప్ర‌య‌త్నించాం. అయినా ప‌రిస్థితిలో మార్పు లేదు' అని ప‌త‌న‌మిట్ట జిల్లా వైద్యాదికారి డాక్ట‌ర్ ఎన్ షీజా అన్నారు. 
 
ఇప్ప‌టికే 42 రోజుల‌పాటు ఆమెను హాస్పిట‌ల్‌లోనే చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. ల‌క్ష‌ణాలు లేవు క‌దా అని డిశ్చార్జ్ చెయ్య‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కాబ‌ట్టి కోజెన్‌చేరి హాస్పిట‌ల్ కి త‌ర‌లిస్తాం.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేకుంటే కొట్టాయం మెడిక‌ల్ కాలేజి ఆసేప‌త్రికి బ‌దిలీ చేయాల‌ని చూస్తున్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. 
 
క‌రోనా రోగుల‌ను 14 రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉంచాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే కేర‌ళ‌లో మాత్రం ఇంక్యుబేష‌న్ వ్య‌వ‌ధిని 28 రోజుల‌వ‌ర‌కు పొడిగించింది. ఇటీవ‌లే కేర‌ళ‌లో ఓ ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. 
 
ఓ మ‌హిళ త‌బ్లీగి జ‌మాత్ స‌భ్యులు ప్ర‌యాణించిన కంపార్ట్‌మెంట్‌లో ప‌ర్య‌టించింది. అయితే ఆమెలో 22 రోజ‌ల త‌ర్వాత క‌రోనా ల‌క్ష‌ణాలు వెలుగు చూశాయి. దీంతో కేరళ సర్కారు 14 రోజల క్వారంటైన్ సమయాన్ని ఏకంగా 28 రోజులకు పొడగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టులపై కరోనా పడగ... నానాటికీ పెరుగుతున్న కేసులు