Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తాజా గణాంకాలు...

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తాజా గణాంకాలు...
, సోమవారం, 4 జనవరి 2021 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో 16,505 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 19,557 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,03,40,470కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,649కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,46,867 మంది కోలుకున్నారు. 2,43,953 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,56,35,761 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం 7,35,978 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 518 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,740కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,81,083 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,551కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,106 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,942 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 60  కరోనా కేసులు నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో తెరాసకు షాక్ : బీజేపీలోకి పెరిగిన వలసలు