Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 73,272 కేసులు

భారత్‌లో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 73,272 కేసులు
, శనివారం, 10 అక్టోబరు 2020 (10:13 IST)
భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 69 లక్షల 79 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 73,272 కేసులు నమోదు కాగా, 926 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 82,753 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 69,79,424 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,83,185 ఉండగా, 59,88,822 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,07,416 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.81 శాతంగా ఉంది. 
 
దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.54 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 12.65 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11,64,018 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 8,57,98,698 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?