Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?

అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?
, శనివారం, 10 అక్టోబరు 2020 (09:54 IST)
అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం దత్తప్ప గూడెంలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో నవిత(22) అనే యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నవిత, పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎంగేజ్మెంట్ ముందు రోజే పరుషరాములుతో నవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై మార్చి4న ఆర్య సమాజ్‌లో ఇరువురు వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో వారిని మంచిగా చూసుకుంటామంటూ పరుశరాములు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి జంటను తీసుకెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా ఆదనపు కట్నం కోసం నవితను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. 
 
రోజు రోజుకు వేధింపులు అధికమవడంతో తీవ్రమనస్తాపానికి గురైన నవిత రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవిత మృతి చెందింది. ఈ ఘటలనకు సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న అత్తింటివారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో దేశవ్యాప్తంగా జియో 5జి సేవలు: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ