Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్‌ 19పై సీఎం జగన్ సమీక్ష: బ్లాక్ ఫంగస్ అలా వస్తుందట జాగ్రత్త

కోవిడ్‌ 19పై సీఎం జగన్ సమీక్ష: బ్లాక్ ఫంగస్ అలా వస్తుందట జాగ్రత్త
, శుక్రవారం, 21 మే 2021 (19:38 IST)
కోవిడ్‌ 19పై సీఎం జగన్ సమీక్ష చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఆక్సిజన్‌ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలన్న కొత్త సమాచారం వస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రొటోకాల్స్‌ రూపొందించాలి. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు.. అన్నీ నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించండి.
 
ఆక్సిజన్‌ప్లాంట్లు-ఇన్సెంటివ్‌:
50 పడకలు, అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. 100 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ పెడితే 20 శాతం ఇన్సెంటివ్‌. ముందస్తుగానే వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ద్వారా చురుగ్గా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించవచ్చు. కనీసం 4 నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లుఏర్పాటయ్యేలా చూడాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బెడ్‌ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకోసం ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేయాలి. 
 
భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా:
రాష్ట్రంలో 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.
భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనేందుకు ఈ ఏర్పాట్లు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగినట్టుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి జరగాలి. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
కాగా, ఆక్సిజన్‌ తయారీలో వినియోగించే జియోలైట్‌ కొరతను ఎదుర్కొనేందుకు కడపలో త్వరలో ఆ పరిశ్రమ ఏర్పాటవుతుందని సమావేశంలో అధికారులు తెలిపారు.
 
వ్యాక్సినేషన్‌:
వ్యాక్సిన్ల కోసం వీలైనంత వేగంగా గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం. 2 కోట్ల మందికి సరిపడా 4 కోట్ల డోస్‌లు ఇప్పుడు సేకరిస్తుండగా, వీలుంటే ఇంకా ఎక్కువ వచ్చేలా చర్యలు చేపట్టాలి. తొలుత 45 ఏళ్లకు పైబడిన వారందరికీ రెండు డోస్‌లు ఇవ్వాలి. ఆ తర్వాత 18-45 ఏళ్ల మధ్య వారికి కూడా తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్లు ఇవ్వాలి. కాబట్టి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు సేకరించాలి
 
ఆహారం, పారిశుద్ద్యం:
కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగులకు మంచి ఆహారం అందించాలి. అదే విధంగా ఆ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలి. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి, చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి కొరత లాకుండా ఉండాలన్న సీఎం. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం.
ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి. రోగులకు అసౌకర్యంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం.
 
అధిక ఫీజులు వసూలు చేస్తే..:
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి. అలాగే రెమ్‌డెసివర్‌ వంటి ఇంజక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రుల పైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్‌ అధికారులు బుక్‌ చేసిన కేసులపై చర్యలుండాలి.
 
ఆ ఔషథంపై శాస్త్రీయ నిర్ధారణ:
నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం ఆదేశం. నెల్లూరు ఆయుర్వేదం మందుపై కేంద్రం ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని సీఎం నిర్దేశం. కాగా, రాష్ట్రంలో ఆక్సిజన్‌సరఫరా, నిల్వలతో పాటు, కోవిడ్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని సమావేశంలో అధికారులు వివరించారు.
 
ఆక్సిజన్‌రవాణా కోసం ఇప్పుడు 2 ఆక్సిజన్‌ ట్రైన్లు నడుస్తున్నాయన్న అధికారులు. ఈ వారంలో మరో ఆక్సిజన్‌ ట్రైన్‌ ప్రారంభం అవుతుందని వెల్లడి. దీంతోపాటు భువనేశ్వర్‌కు ప్రతిరోజూ 4 ట్యాంకర్లను ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నామన్న అధికారులు. దేశంలో ఎక్కడ ఆక్సిజన్‌ కేటాయించినా డ్రా చేయగలుగుతున్నామని వెల్లడి. ఐఎస్‌ఓ ట్యాంకర్లను వినియోగించుకుని సమర్థవంతంగా ఆక్సిజన్‌ సేకరిస్తున్నామన్న అధికారులు.
 
అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగంపై ఆడిట్‌ చేస్తున్నట్లు వెల్లడి. ఆక్సిజన్‌ఎక్కడ వృథా అవుతున్నా అప్రమత్తం చేస్తున్నామని, ఆ వృథాను అరికట్టడంపై దృష్టి పెడుతున్నామన్న అధికారులు. ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా, పంపిణీ, ఆస్పత్రుల్లో వినియోగం.. వీటన్నింటినీ కూడా పూర్తిగా కంప్యూటరైజ్‌ చేశామన్న అధికారులు. 9 పీఎస్‌ఏ యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా 52.75 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లభించందన్న అధికారులు. మరో 5 పీఎస్‌ఏ యూనిట్లను పునరుద్ధరించే పనులు పురోగతిలో ఉన్నాయన్న అధికారులు. 12 నైట్రోజన్‌ యూనిట్లను కూడా మార్పు చేయడంద్వారా మరో 11.41 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అదనంగా వస్తుందన్న అధికారులు
కొత్తగా నాలుగు కంపెనీలు ఆక్సిజన్‌ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయని తెలిపిన అధికారులు.
 
కోవిడ్‌ ఆస్పత్రులు–బెడ్లు:
రాష్ట్రంలో ప్రస్తుతం 621 కోవిడ్‌ ఆస్పత్రులలో 45,611 బెడ్లు ఉండగా, వాటిలో 38,763 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, అందులో 28,189 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో 6,217 ఐసీయూ బెడ్లు, 22,756 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌బెడ్లు, 16,638 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌బెడ్లతో పాటు, 3,407 వెంటిలేటర్లు ఉన్నాయని వారు తెలిపారు.
 
గత సెప్టెంబరులో:
కాగా, గత ఏడాది సెప్టెంబరులో చూస్తే 261 ఆస్పత్రులో 37,441 బెడ్లు. వెంటిలేటర్లు 2,279 మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటితో పాటు, ఐసీయూ బెడ్లు, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌బెడ్లు, నాన్‌ ఐసీయూ, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు గణనీయంగా పెరిగాయని సమీక్షలో అధికారులు చెప్పారు. 
 
గ్లోబల్‌ టెండర్లు:
రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ (4 కోట్ల డోస్‌లు) వేసే విధంగా ఈనెల 13న గ్లోబల్‌ టెండర్లు పిలవడం జరిగిందని సమావేశంలో అధికారులు తెలిపారు. టెండర్లకు సంబంధించి ప్రిబిడ్‌ సమావేశం ఈనెల 20న జరగగా, బిడ్ల దాఖలుకు జూన్‌ 3ను చివరి తేదీగా ప్రకటించినట్లు వారు చెప్పారు. టెండర్లకు మంచి స్పందన వస్తోందని అధికారులు వివరించారు. 
 
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర,కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్,  104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జువ్వాది సుబ్రమణ్యంతో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టాఫీస్‌ సేవింగ్ స్కీమ్స్.. రూ.1000ల నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు..!