Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో 108 మందికి నెగెటివ్-ముగ్గురికి పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 108 మందికి నెగెటివ్-ముగ్గురికి పాజిటివ్‌
, శనివారం, 21 మార్చి 2020 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వెయ్యి ఆరు మంది అనుమానితులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక బులెటిన్‌లో పేర్కొంది. వీరిలో 135 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. అందులో 108 మందికి నెగెటివ్‌ రాగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొంది. మిగిలిన 24 మంది నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
 
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రెండు, మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణాన్ని ప్రారంభించే దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి. 
 
ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ ఆదివారం మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌కు గబ్బిలాలే కారణమా?