Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెన్సీ నోటు కాదు దోరగా వేయించిన దోశె.. నెటిజన్స్ కామెంట్స్

భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతా

కరెన్సీ నోటు కాదు దోరగా వేయించిన దోశె.. నెటిజన్స్ కామెంట్స్
, శుక్రవారం, 25 ఆగస్టు 2017 (16:29 IST)
భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను శుక్రవారం నుంచి చెలామణిలోకి తెచ్చింది. కొత్త రూ.200 రూపాయాల నోటు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు ఖాతాదారులు క్యూ కట్టారు. కొత్త నోటును చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. రూ.50, రూ.200 నోట్ల కోసం ఎగబడ్డారు. రూ.200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే కొత్త నోట్లు ఏటీఎంల ద్వారా చలామణిలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.
 
అయితే, ఈ నోటు రంగుపై నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నోటును వినాయక చవితి రోజు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వాన్ని చూపిస్తుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికి వరకు విడుదల చేసిన రూ.2000, రూ.500, రూ.200, రూ.50 నోట్లన్నీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన రంగుల్లోనే ఉన్నాయన్నారు. మరి అబ్బాయిలకోసం నోట్లు ప్రచురించరా? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.200 నోటు కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లొద్దు.. ఎందుకంటే?