Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ఉపయోగిస్తే..?

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ఉపయోగిస్తే..?
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:36 IST)
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ మళ్లీ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో వారికి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు.

ఫిబ్రవరి 1 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోనే ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 250 ట్రైన్స్‌లో ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. 
 
కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ గతంలో ఇక్యాటరింగ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవి మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తే.. ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
ఈ యాప్ ద్వారా సులభంగా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ వద్దనుకుంటే https://www.ecatering.irctc.co.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. 
 
దేశవ్యాప్తంగా ఉన్న 500 రెస్టారెంట్ల ద్వారా ఫుడ్ డెలివరీ పొందొచ్చు. మీకు నచ్చిన ఫుడ్ పొందొచ్చు. దీని కోసం పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, సీటు/బెర్త్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసే వారికి ఈ సర్వీసుల వల్ల ఊరట కలుగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఓబుల్ రెడ్డి కిడ్నాప్? అధికార పార్టీ చర్యేనంటూ తెదేపా