Publish Date: Fri, 12 Aug 2022 (22:23 IST)
Updated Date: Fri, 12 Aug 2022 (22:25 IST)
హైదరాబాద్కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిక నైనా జైస్వాల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
సదరు వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని నైనా తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మానసిక సమస్యలున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.