Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

Advertiesment
Tirumala

ఠాగూర్

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (09:42 IST)
వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరితగతిన కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, వీఐపీ సిఫారసు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెసవి సెలవులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని తితిదే నిర్ణయించింది. 
 
శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేసిన తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని కూడా ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. 
 
ఈ మార్పు మేరకు.. బ్రేక్ దర్శనం ఇకపై ఉదయం 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. తాజా నిర్ణయంతో మే ఒకటో తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలను అనుమతించరని తితిదే అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!